జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాజాగా మరోమారు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాపాక మాట్లాడుతూ తాను ఇప్పటికీ జనసేన ఎమ్మెల్యేనని.... కాకపోతే వైసీపీ కార్యక్రమాలు బాగున్నాయని తెలిపారు. తాను 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ట్రై చేసినా టికెట్ దక్కలేదని... జనసేనవాళ్లు తన దగ్గరకు వచ్చి పోటీ చేయమన్నారని చెప్పారు. 
 
జనసేనను పట్టించుకునేవాళ్లు లేరని రాపాక సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య తేడా ఉందని... చిరంజీవి ప్రజలకు దగ్గరగా ఉంటే పవన్ ప్రజలకు దూరంగా ఉన్నాడని చెప్పారు. నాదెండ్ల మనోహర్ పవన్‌ను రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళుతున్నారని... పార్టీలో ఉన్నవాళ్లు అదే అనుకుంటున్నారని చెప్పారు. జగన్ పథకాలు అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు చేశారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: