క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు స్వైర‌విహారం చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఆదివారం ఉదయం వరకు 19,906 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా 19,459 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఒకేరోజు 380 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య 16,475కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,10,120 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇప్పటివరకు 3,21,273 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. 

 

ఇదిలా ఉంటే బోర్డ‌ర్‌లో బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు ఆదివారం ఒక్క రోజే ఏకంగా 21 మందికి క‌రోనా సోకింది.  ఓ వైపు చైనాతో స‌రిహ‌ద్దు వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌నం నేప‌థ్యంలో యుద్ధ వాతావ‌ర‌ణం అల‌ముకున్న వేళ సైన్యంలో ఒక్క రోజే 21 మందికి క‌రోనా సోక‌డంతో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఇప్ప‌టి వ‌ర‌కు సైన్యంలో 305 మందికి క‌రోనా పాజిటివ్ కేసులు వ‌చ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: