గత కొన్ని రోజులుగా మూగజీవాలపై అమానుష ఘటనలు కొనసాగుతున్నాయి. రాక్షస ఆనందాన్ని పొందడానికి కొందరు జంతువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కేరళలో ఘటన మరవక ముందే ఏపీలో వేటగాళ్లు పెట్టిన నాటు బాంబు వల్ల ఆవు తీవ్రంగా గాయపడింది. చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం కొగిలేరు గ్రామంలో మేత కోసం వెళ్లిన ఆవు నాటుబాంబుతో పెట్టిన పండును కొరకడంతో బాంబు పేలింది. 
 
ఆవు నోటి భాగం చిద్రం కాగా విషయం తెలిసిన స్థానికులు పశువైద్యుడికి ఈ విషయం గురించి సమాచారం అందించారు. వైద్యుడు సకాలంలో చేరుకుని ఆవుకు చికిత్స చేశారు. పశువులు మేత మేసేందుకు వెళ్లే చోట నాటు బాంబులు పెట్టడం ఏంటని జంతు ప్రేమికుల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: