రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలుస్తుంది. తాజాగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీళ్ళు తాగడానికి వచ్చిన ఒక వానరాన్ని ఏకంగా  ఉరి వేసి చంపేశారు కొంతమంది శాడిస్టులు. 

 


 తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఒక కోతి కి ఉరి వేసి అది విలవిలలాడుతుంటే చూసి రాక్షస ఆనందం పొందారు.ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు, ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: