ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. పుదుచ్చేరిలో ఈ మహమ్మారి వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుంది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి తండ్రికి వైరస్ పాజిటివ్ అని రావడంతో సీఎం వి.నారాయణస్వామి తో పాటు అతని కార్యాలయంలో పనిచేస్తున్న 51 మంది సిబ్బంది కి కరోనా నిర్దారిత పరీక్షలు చేశారు.
ఇక ఈ రిపోర్టు లో సీఎం నారాయణ స్వామి తో పాటు 51 మంది సీఎం కార్యాలయ సిబ్బందికి కూడా కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు.