ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు విల విలలాడిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక కరోనాతో ప్రజా ప్రతినిధులు, సినీ తారలు కన్ను మూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌ రక్షణ కార్యదర్శి అబ్దుల్లా అల్‌ వెూసీన్‌ (57) కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. అబ్దుల్లా మే 29న అనారోగ్యంతో ఢాకాలోని మిలిటరీ ఆసుపత్రి (సీఎంహెచ్‌)లో చికిత్స పొందుతున్నాడు.  

 

జూన్ 18 నుంచి ఆయన పరిస్థితి విషమంగా మారిందని.. అప్పటి నుంచి వైద్యలు ఆయన్ని బతికించడానికి వైద్యం చేస్తూ వస్తున్నారని.. అప్పటికే ఆరోగ్యం పూర్తిగా విషమించినట్లు సమాచారం. సోమవారం ఉదయం 8:45 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో వైద్యులు చికిత్సకు ఉపకరించే లోపే అతడి శరీరం సహకరించక మరణించినట్లు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి బంగ్లాదేశ్‌ రక్షణ శాఖ సిబ్బంది నివాళులర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: