ఈ మధ్యకాలంలో నగరంలో ఎంతో మంది పోలీసులు కూడా కరోనా మహమ్మారి బారిన పడుతున్న విషయం తెలిసిందే, అయితే ఇటీవల బంజారాహిల్స్ లో చాలా మంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడటం సంచలనంగా మారింది.
అయితే తాజాగా కరోనా వైరస్ బారిన పడిన పోలీసు అధికారులు కొంతమంది ప్రాణాంతకమైన మహమ్మారిని జయించి ప్రస్తుతం తిరిగి విధుల్లో చేరారు.బంజారా హిల్స్ లోని పోలీసులు 26 మంది వైరస్ బారిన పడగా.. వారిలో 15 మందిని రికవరీ అయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు, కరోనా నుంచి కోలుకుని విధుల్లో చేరిన వారికి హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సాదరంగా ఆహ్వానించారు.