ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు  గుప్పిస్తుంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్ వద్ద పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ నిరసన చేపట్టారు. 

 

 ఇక వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని  కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయగా కానీ ఉద్రిక్త  పరిస్థితి చోటు చేసుకుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ నేతల నిరసనలతో పలు  కలెక్టర్ కార్యాలయాల  ముందు ఉద్రిక్త  పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: