ఇటీవలే రోడ్డు ప్రమాదాలతో పాటు జల ప్రమాదాలు కూడా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే గోదావరి నది లో జరిగిన పడవ ప్రయాణం లో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా బంగ్లాదేశ్ లో నదిలో అలాంటి ప్రమాదం చోటు చేసుకుంది.
బంగ్లాదేశ్లో గురి గంగానదిలో మున్షి గంజ్ నుంచి సదర్ ఘాట్ వెళ్తున్న ఎంవి మార్నింగ్ బర్ద్ ఎదురుగా వస్తున్న మయూరి 2 పడవలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం లో 50 మంది నీటిలో పడగా.. ఒక 23 మంది జలసమాధి అయిపోయారు. ఈత వచ్చిన కొంతమంది ఎంతో కష్టంగా ఒడ్డుకు చేరుకున్నారు.