ఈ మద్య కొంత మంది తమ అందాలకు మెరుగులు దిద్దే ప్రయత్నంలో పూర్తిగా అందవిహీనంగా అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి.  చిత్ర విచిత్రమైన ప్రొడెక్ట్స్ వాడటంతో ఉన్న అందం కాస్త మంటగలిసిపోయిన సంఘటనలు వెలుగు లోకి వచ్చాయి. వాస్తవానికి దేవుడు ఇచ్చిన మన రూపాన్ని ఎవరూ మార్చలేరని.. సమాజంలో బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం గొప్పదన్న విషయం తెలిసిందే. కానీ ఈ మద్య మనుషుల బాహ్య అందానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న రోజులివి. దీంతో నలుపు రంగులో ఉన్నవారు ఎంతో మనోవేదనకు గురవుతున్నారు.

 

పుట్టుకతో వచ్చిన తమ శరీర రంగును మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం నలుపు ఉండడాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేస్కుని మరణిస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి ఓ సంఘటన జరిగింది. జిల్లాలోని మాణిక్య‌పురానికి చెందిన సునీల్ నాయ‌క్(20) డిగ్రీ చ‌దువుతున్నాడు. కాలేజీలో అమ్మాయిలు ఉండ‌టంతో నాయ‌క్ కూడా అందంగా త‌యార‌య్యే వెళ్లేవాడు. కానీ త‌న ముఖంపై మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్నాయి. దీంతో ముఖంపై రూమాలు వేసుకుని బ‌య‌ట‌కు వెళ్లేవాడు సునీల్.

 

మ‌చ్చ‌ల‌ను తొల‌గించుకునేందుకు డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించాడు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేదు.. ఇక తన ముఖం ఎవరికీ చూపించలేనని మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.  ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని సోంపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: