కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

 

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మంగాపూర్​ గ్రామ సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

 

శివ్వంపేట గ్రామానికి చెందిన చంద్రయ్య, తల్లి అనసూయలు పింఛన్​ డబ్బుల కోసమని ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మంగాపూర్‌ గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడం వల్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: