చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. 50 గ్రామాల నివాసిత ప్రజలు టెండూ ఆకుల సేకరణ కోసం వారికి నగదు చెల్లింపుతో సహా వారి డిమాండ్లతో కలెక్టర్ కార్యాలయంలోకి ప్రవేశించడానికి పోలీసుల ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేశారు. వారు కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి 25 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చారు.
ఈ ప్రజలు చెర్పాల్ గ్రామం నుంచి బీజాపూర్లోని కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి 25 కిలోమీటర్లు కాలినడక నడుచుకుంటూ చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా పరిజ్ఞానం పెరిగిన సమయంలో కూడా చోటుచేసుకోవడం చాలా బాధాకరం. కేవలం ఆకుల సేకరణ కోసం , వారి డిమాండ్లను అధికారులకు తెలియజేయడం కోసం ఇంత దూరం కాలినడకన ప్రయాణించి చేరుకున్న తర్వాత అక్కడ విపత్కర పరిస్థితుల్లో పోలీసులకు, ఈ ప్రజలకు వివాదం మధ్యలో తోపులాట జరిగింది.
Chhattisgarh: Residents of 50 villages in Bijapur y'day met the Dist collector with their demands, including cash payment to them for collection of Tendu leaves. Say, "The collector told us that we will be given cash within two days. If that doesn't happen we will protest again." pic.twitter.com/TA7knl5ZtV
— ANI (@ANI) June 29, 2020