విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి బెంజిన్ లీక్ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వినయ్చంద్, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.
సాయినార్ కంపెనీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. బాయిలర్లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్ లీకైనట్లు వివరించారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్ఛార్జి నరేంద్ర, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.