గత 20 రోజుల నుంచి ఎరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో నేడు ఏమార్పు  లేదు. డీజిల్ పెట్రోల్ ధరలు అదే విధంగా ఉన్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ లేదా డీజిల్ ధరలో ఈ రోజు మార్పు లేదని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. పెట్రోల్ ధర రూ .80.43, డీజిల్ ధర రూ .80.53 గా ఉందని పేర్కొన్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఈ స్థాయిలో పెరగడంపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోజు రోజుకి సామాన్యుల నెత్తిన కేంద్రం భారం వస్తుంది అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపు ఇస్తున్నాయి. నిన్న కాంగ్రెస్ నేతలు సైకిల్ తొక్కి నిరసన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: