రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎప్పటికప్పుడు ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలతో పాటు, ప్రభుత్వం తీసుకొని వస్తున్న పథకాల గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి జూలై 1 నుంచి 203 కోట్లతో కొనుగోలు చేసిన 104,108 వాహనాలను వీటిని ఆంబులెన్స్ , మొబైల్ క్లినిక్ సేవల గా ఉపయోగిస్తారు అని తెలిపారు. ఇందులో ఆధునీకరణ చేసి వెంటిలేటర్లు, ఇసీజి, ప్రాణాపాయ స్థితిలో ఉపయోగపడే అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.
మొట్టమొదటిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మొదలుపెట్టిన ఈ 108 సేవలను ఆధునికరిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల మీదకి తీసుకురాబోతున్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తపనకు కార్యరూపం ఇదే అని విజయసాయి రెడ్డి అన్నారు.
ప్రజారోగ్యం పట్ల సిఎం జగన్ గారి తపనకు కార్యరూపం జూలై 1 నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 203 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక 104, 108 అంబులెన్సులు, మొబైల్ క్లినిక్ ల సేవలు మొదలవుతాయి. వెంటిలేటర్లు, ఇసిజి, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు వీటిల్లో ఉంటాయి.
— Vijayasai reddy v (@VSReddy_MP) June 30, 2020