గత పది రోజులుగా సరిహద్దుల్లో పాకిస్తాన్ చెలరేగిపోతుంది. భారత బలగాలను లక్ష్యంగా చేసుకుని వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు పొడుస్తుంది. భారత్ నుంచి సరైన సమాధానం వస్తున్నా సరే పాకిస్తాన్ మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా మరోసారి పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు దిగడం జరిగిందని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. 

 

బారాముల్లాలోని నౌగం సెక్టార్‌ లోని ఎల్‌ఓసి వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంగించింది అని అధికారులు వెల్లడించారు. ఈ రోజు ఉదయ౦ మోర్టార్ మరియు ఇతర ఆయుధాలతో కాల్పులను పాకిస్తాన్ ఆర్మీ జరిపింది అని భారత ఆర్మీ పేర్కొంది. ఇక భారత ఆర్మీ కూడా అదే స్థాయిలో సమాధానం చెప్తుంది. కాగా ఇటీవల  జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: