ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రి పెర్ని నానీ ముఖ్య అనుచరుడు, వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యలో పాత్ర ఉంది అని అనుమానిస్తున్న ముగ్గురుని పోలీసులు బందరులో అదుపులోకి తీసుకున్నారు. వారి ముగ్గురిపై ఏ1 ఏ2, ఏ3 గా కేసులు నమోదు చేసారు. 

 

ఇక టీడీపీ మాజీ మంత్రి కోల్లు రవీంద్ర పై కూడా హత్య కేసు నమోదు చేసారు. ఈ కేసులో ఆయనను ఏ4 గా చేర్చారు. ఆయన ఇంటి వద్ద ఇప్పటికే పోలీసు బలగాలు మొహరించాయి. ఆయనను ఈ కేసులో కుట్ర దారుడి గా భావిస్తున్నారు పోలీసులు. ఈ హత్యతో ఒక్కసారిగా బందరులో కలకలం రేగింది. టీడీపీ నేతల ఇళ్ళ వద్ద భద్రత పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: