విచ్చలవిడిగా తమిళనాడు మద్యం అమ్మకాలు _చిత్తూరు జిల్లాలో రాష్ట్ర సరి"హద్దులు" దాటిన తమిళనాడు మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోంది. కార్వేటినగరం మండలం కొల్లగుంట చెక్-పోస్ట్ వద్ద ఎక్సైజ్ శాఖ రూట్-వాచ్ తనీఖీలు నిర్వహిస్తుండగా కార్వేటినగరానికి చెందిన ఎస్.చాంద్ బాషా, ఎస్ఆర్ పురంకు చెందిన టి.చెంగల్ రెడ్డి లు ద్యిచక్ర వాహనంలో  తమిళనాడు నాన్డ్యుాటి పెయిడ్ లిక్కరు 68 క్వార్టర్ బాటిళ్ళతో పట్టుకున్నారు. వీరిపై కేసునమోదు చేశారు. అదేవిధంగా చోక్కమడుగుక్రాస్ వద్ద కార్వేటినగరంకి చెందిన టి.వెంకటేష్, వి.శేఖర్ వద్ద 35క్వార్టర్ నాన్డ్యటి పెయిడ్ లిక్కరును స్వాధీనం చేసుకుని వీరిపై కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. రిమాండ్ తదుపరి చర్య నిమిత్తం కార్వేటినగరం యస్.ఇ.బి స్టేషన్ కు అప్పగించారు

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: