మన దేశ భూభాగాన్ని చైనా ఏమాత్రం ఆక్రమించలేదని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చెప్పారు. మోదీ మాట‌లు ఎలా ఉన్నా ఉప‌గ్ర‌హ చిత్రాలు చూస్తుంటే మాత్రం చైనా మ‌న దేశ భూభాగంలోకి చొచ్చుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం 423 మీటర్ల మేర చైనా చొచ్చుకొచ్చింది. 1960లో చైనా స్వయంగా తనకు తాను ప్రకటించుకున్న సరిహద్దును దాటి వచ్చి భారత భూభాగాన్ని ఆక్రమించింది.

 

ఇక్క‌డ చైనా కొన్ని తాత్కాలిక నిర్మాణాలు కూడా చేప‌ట్టింది. 16 గుడారాలు, టార్పాలిన్లు, ఒక భారీ నిర్మాణాన్ని చైనా సైనికులు ఏర్పాటు చేసుకున్నారు.ఓ వైపు మ‌న‌ భూభాగాన్ని చైనా ఆక్రమించలేకపోయిందని ప్రధాని చెప్పగా… ఇప్పుడు అందుకు భిన్నంగా ఉపగ్రహ చాయచిత్రాలు ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉపగ్రహ చాయచిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: