మంగళగిరి  మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ మహిళ మృత్యువాత పడింది. మంగళగిరి పట్టణంలోని బాప్టిస్ట్ పేటకు చెందిన రావూరి రాణి (33) పాడిగేదెలను మేపేందుకు  మండలంలోని ఆత్మకూరు గ్రామ పంచాయతి పరిధిలోని  పంటపొలానికి వెళ్లింది.

 అయితే సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన  చిన్నపాటి వర్షానికి పిడుగుపడటంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు  క్షతగాత్రురాలిని పట్టణంలోని ప్రభుత్వ  ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. దీంతో  పట్టణంలోని బాప్టిస్ట్ పేట కాలనీలో విషాదఛాయలు నెలకొన్నాయి.

మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.  కాగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చినకాకాని లోని ఓ ప్రైవేటు వైద్యశాల మార్చురీకి తరలించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: