దేశ వ్యాప్తంగానే కాదు సైనికుల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. సరిహద్దుల్లో పహారా కాస్తున్న సైనికులు ఇప్పుడు భారీగా కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా  బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 53 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) సిబ్బంది కరోనా బారిన పడ్డారు. నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారు. 

 

గత మూడు రోజుల నుంచి కూడా దాదాపు 130 వరకు కరోనా కేసులు బీఎస్ఎఫ్ లో నమోదు అయ్యాయి. ఇప్పుడు ఈ విభాగంలో 354 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరియు 659 మంది సిబ్బంది ఈ రోజు వరకు కోలుకున్నారని బిఎస్ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: