జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నాయి బలగాలు... ఎక్కడో ఒక చోట రోజు ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. తాజాగా మరో చోట భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు కీలక ఉగ్రవాదులను భారత బలగాలు కాల్చి చంపాయి. 

 

జమ్మూ & కాశ్మీర్ అనంతనాగ్‌లో నేడు జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇటీవల అనంత్ నాగ్ లోని వాఘామా ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని, 5 ఏళ్ల బాలుడిని మూడు రోజుల ముందు వాళ్ళు చంపారు. ఇప్పుడు ఆ ఇద్దరినీ గుర్తించి బలగాలు కాల్చి చంపాయి. ఆ ప్రాంతంలో మరి కొందరు ఉగ్రవాదులు ఉన్నారు అని తెలుస్తుంది. వారి కోసం ఆపరేషన్ చేపట్టాయి బలగాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: