తెలంగాణాలో కరోనా కేసులు ఇప్పుడు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ప్రజా ప్రతినిధులు కూడా కాస్త కంగారు పడుతున్నారు. ముఖ్యంగా తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులకు కరోనా సోకుతున్న నేపధ్యంలో సిఎం కేసీఆర్  ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రగతి భవన్ కి వచ్చే వారు కరోనా పరిక్షలు చేయించుకుని రావాలి అని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

ప్రగతి భవన్ కి ప్రతీ రోజు వందలాది మంది వస్తూ ఉంటారు అని వారిలో అధికారులు కూడా ఉంటారు అని, నాయకులు ఎక్కడ పడితే అక్కడ తిరిగి వస్తే అధికారులతో పాటుగా ఇతరులకు కూడా ఇబ్బందులు వస్తాయని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆదేశించారని సమాచారం. హోం మంత్రికి, డిప్యూటి స్పీకర్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డ్ అధికారులు కూడా కరోనా బారిన పడ్డారు

మరింత సమాచారం తెలుసుకోండి: