ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో వణికిపోతుంది. ప్రపంచలో కోటి వరకు కేసులు దాటిపోయిన విషయం తెలిసిందే. ఇందులో మూడోొవంతు ఒక్క అమెరికాలో కేసులు, మరణాల సంఖ్యనమోదు అయ్యాయి. ఇలా కరోనాతో చనిపోతున్న సమయంలో.. కొంత మంది ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఇక్కడ కొంత కాలంగా గన్ కల్చర్ పెచ్చుమీరుతుంది. తాజాగా అమెరికా ఫ్లోరిడాలోని జాక్సన్ విల్లేలో కాల్పుల మోత మోగింది. అమెజాన్ కార్యాలయం వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
ఈ ఘటనలో చనిపోయిన 20 ఏళ్ల వ్యక్తి.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అమెజాన్ కార్యాలయం వెలుపల వరుసలో నిల్చొన్నాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ కారులో వచ్చిన ఇద్దరు దుండగులు బాధితుడే లక్ష్యంగా ఈ దాడికి యత్నించినట్లు అధికారులు వెల్లడించారు.ఘటన అనంతరం నిందితులు పారిపోగా.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.