ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ట్రైనీ ఐఏఎస్‌ లతో మాట్లాడారు. వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు ఐఏఎస్‌లు పనిచేయాలని సీఎం అన్నారు. తమకు కేటాయించిన శాఖలో అవగాహనతో పాటు అనుభవం సంపాదించుకోవాలని... వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ముందడుగులు వేయాలని జగన్ అన్నారు. ప్రభుత్వంలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారని, వారి మార్గ నిర్దేశం తీసుకోవాలని సీఎం సూచించారు. 
 
కరోనా విజృంభణ వల్ల ట్రైనీ ఐఏస్ లకు ముస్సోరీలో రెండో విడత శిక్షణ వాయిదా పడింది. దీంతో వాళ్లు శాఖల్లో అంశాలను, విధానాలను తెలుసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారు. ట్రైనీ ఐఏఎస్ లు పలు శాఖలపై ప్రజెంటేషన్లు తయారు చేసి వాటిని సీఎంకు చూపించారు. సీఎం జగన్ ప్రజంటేషన్లు ఇచ్చిన ఐఏఎస్ లను అభినందించడంతో పాటు శాలువాలతో సత్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: