దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ ఇంటిని తాకింది. అమీర్ ఖాన్ సిబ్బంది కరోనా భారీన పడ్డారు. అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో అమీర్ కుటుంబ సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కుటుంబ సభ్యులందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని తల్లికి మాత్రం ఇంకా పరీక్షలు నిర్వహించలేదని అమీర్ ఖాన్ తెలిపారు. 
 
ఆమెకు నెగిటివ్ రావాలని కోరుకుంటున్నానని అన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తక్షణమే స్పందించి తమకు సహాయసహకారాలు అందించారని.... కోకిలా బెన్ ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అమీర్ ఖాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమీర్ లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో నటిస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: