ఏపీ కరోనా బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 704 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14,595కి చేరుకుంది. కరోనా కారణంగా నేడు ఏడుగురు మృతి చెందారు. గత కొంత కాలంగా లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోతూ వస్తున్నాయి.  కరోనా కేసులను కట్టడి చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పకడ్భందీ చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వల్ల కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు.

 

తాజాగా ప్రకాశం జిల్లాల పోలీస్ శాఖలో ఒక సీఐ, ఇద్దరు ఎస్ ఐ లు, ఏడుగురు కానిస్టేబుళ్లకు కరోనా అని సమాచారం. విధులకు దూరంగా ఉన్నతాధికారులు. దాంతో కరోనా ప్రభావిత పోలీస్ స్టేషన్లలో కరోనా పరీక్షలు. మార్చి నెల నుంచి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి పోలీసులు ప్రజలను రక్షిస్తూ బయటకు వెళ్లకుండా చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రక్షించే పోలీసులకు వరుసగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: