ఈ మద్య స్నేహితుల మద్య తలెత్తుతున్న చిన్న చిన్న వివాదాలు చివరికి ప్రాణాలు తీసే స్థాయికి చేరకుకుంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చాలా మంది ఇంటిపట్టున ఉంటు సెల్ ఫోన్లకే అంకితమయ్యారు.  తాజాగా  బోనకల్  రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న రాత్రి 9:30గంటల సమయంలో  కోలా గోపి, వట్టికొండ నాగేశ్వరావు అనే ఇద్దరు యువకులు పక్కపక్కనే కూర్చొని మద్యం సేవిస్తూ సెల్ ఫోన్లో  ఆన్లైన్ లో లూడో గేమ్ ఆడుతున్నారు. మొదటగా రూ.50 బెట్టింగ్ పెట్టినారు. వరసగా గోపి రెండుసార్లు ఓడిపోయినాడు.

 

ఈసారి బెట్టింగ్ లో గోపి రూ.500 అనగానే నాగేశ్వరావు నీకు అంతా కెపాసిటీ లేదులే అంటూ అవహేళన చేశాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన  గోపి  పక్కనే ఉన్న మద్యం సీసాతో వట్టికొండ నాగేశ్వరావు మెడ తీవ్రంగా గాయం చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. నాగేశ్వరావు భార్య ఇచ్చిన పిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ కొండలరావు తెలిపాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: