కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో కొంత మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పటికికూడా అయోమయం లోనే ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల పదో తరగతి పరీక్షలను రద్దు చేసి అందరిని పాస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్,
అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఎంట్రన్స్ టెస్ట్ ల ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఎంసెట్ పాలిసెట్ ఐసెట్ ఈసెట్ పీజీఈసెట్ లాసెట్ పీజిఎల్సెట్ హెడ్ సెట్ పిఈసి సెట్ లాంటి ఎంట్రెన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపింది, అయితే పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదంట విద్యార్థుల తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించడంతో తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది.