దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జామా మసీద్ మూసివేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు మూడు నెలల తర్వాత తాజాగా జామా మసీద్ జులై 4వ తేదీ నుంచి తెరుచుకోనుంది. ఆ రోజు నుంచి భౌతిక దూరంతో ప్రార్థనలు అంగీకరించనున్నట్లు మసీదు షాహీ పేర్కొన్నారు.
ఎంతో చరిత్ర కలిగిన జామా మసీదు మూసివేయడం ఇదే మొదటిసారి అని చెప్పాలి. ఇక ఇప్పటి వరకు జామా మసీదులో ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన ముస్లింలకు అనుమతి లేదు. కానీ కొన్ని రోజుల్లో ముస్లింలు జామా మసీదులో ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి లభించ నుంది