జార్జి ఫ్లాయిడ్​ కేసు గురించి మాట్లాడటం మానేయకపోతే కేసు విచారణను మరో చోటికి తరలించే అవకాశం ఉందని.. మిన్నెసోటా న్యాయమూర్తి జస్టిస్ పీటర్​ కాహిల్ హెచ్చరించారు.  ఫ్లాయిడ్​ ముఖంపై మోకాలు పెట్టిన పోలీస్​ అధికారి చౌవిన్ ​(44)పై హత్య కేసు నమోదు చేశారు. ఆ సమయంలో అక్కడే ఉండి చౌవిన్​కు సహకరించిన.. మరో ముగ్గురు అధికారులు థామస్​ లేన్, జే. కుయేంగ్​, తౌ థాయ్​పైనా కేసులు నమోదు చేసి... విధుల నుంచి తొలగించారు.

 

​చౌవిన్​ బృందం తమ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఆత్మరక్షణకు ప్రయత్నించారని.. అందులో జాతి వివక్షేమీ లేదంటూ.. కొందరు పోలీసు అధికారులు, న్యాయవాదులు, కుటుంబ సభ్యులు నిరసనలు మొదలెట్టారు. దీంతో, ఈ కేసు గురించి, నిందుతులకు సహకరిస్తూ మాట్లాడితే నిష్పాక్షిక న్యాయం జరగదన్నారు జస్టిస్​ కాసిల్. అందుకే, నిందితుల కుటంబసభ్యులు, పోలీసు అధికారులు మీడియా ముందుకు రావద్దని ఆదేశించారు. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్​ 11కు వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: