ఆంధ్రప్రదేశ్ లో  సిఎం జగన్ ఒకేసారి 1088 అంబులెన్స్ లను  ప్రారంభించారు. చిన్నారుల కోసం ప్రత్యేక అంబులెన్స్ లను సిద్దం చేసింది ఏపీ సర్కార్. కాసేపటి క్రితం జెండా ఊపి సిఎం జగన్ వాటిని విజయవాడ బెంజ్ సర్కిల్ లో  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ళ నానీ, పెద్దిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ సహా, పలువురు వైసీపీ నేతలు మరికొందరు మంత్రులు పాల్గొన్నారు.  

 

అంబులెన్స్ లో ఇంక్యుబెటర్లు వెంటిలేటర్లు ఉండనున్నాయి. కొత్త వాటిలో అత్యాధునిక సదుపాయాలను సిద్దం చేసారు. లైఫ్ సపోర్ట్ బేస్డ్ పరికరాలను సిద్దం చేసారు. ప్రతీ మండల కేంద్రానికి ఒక అంబులెన్స్ ని సిద్దం చేసారు. 74 వేల మందికి ఒక అంబులెన్స్ సిద్దంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: