దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు ఫలించడం లేదు. ఇక ఇదిలా ఉంటే గత 24 గంటల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయినట్టు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గత 24 గంటల్లో 507 మరణాలు మరియు 18,653 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

మొత్తం కేసులు 5,85,493 గా ఉన్నాయని కేంద్ర పేర్కొంది. వీటిలో 2,20,114 క్రియాశీల కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 3,47,979 మంది కోలుకుని బయటపడ్డారని.. 17,400 మంది ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించారు అని పేర్కొంది ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. మహారాష్ట్రలో అత్యధిక కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: