జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ లో  ఉగ్రవాదులు చేసిన దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) జవాన్ & ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. మరియు సోపోర్లో సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 3 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది తీవ్రంగా గాయపడినట్టు ఆర్మీ వెల్లడించింది. గాయపడిన వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు అధికారులు. 

 

ఇక ఇదిలా ఉంటే ఉగ్రవాదుల కాల్పుల నుంచి జమ్మూ & కాశ్మీర్ పోలీసులు మూడేళ్ళ బాలుడుని కాపాడి అతని తల్లి తండ్రులకు అప్పగించారు. ఇక ఈ కాల్పులకు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు దిగినట్టు తెలుస్తుంది. దీనితో భద్రతా బలగాలు స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: