కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి గణేశోత్సవాలు నిర్వహించకూడదని ముంబైకి చెందిన లాల్‌ బాగ్చ రాజా గణేశోత్సవ్ మండలి నిర్ణయించింది . దాని  బదులు బ్లడ్ & ప్లాస్మా విరాళం శిబిరం ఏర్పాటు చేయబడుతుందని...: లాల్‌బాగ్చ రాజా గణేశోత్సవ్ మండలి ప్రకటించింది. 

 

గణేశోత్సవ్‌ను ఘనంగా జరుపుకునే బదులు, లాబాచా రాజా మండలి... విరాళం మొత్తాన్ని సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తుందని మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ వెల్లడించారు. భారత పాకిస్తాన్, భారత్ చైనా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను కూడా మేము సత్కరిస్తామని సుదీర్ సాల్వీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ముంబైలో అత్యంత ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు అక్కడి ప్రజలు అందరూ కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: