భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. వెంకయ్య నాయుడు తాము గర్వించే స్థాయికి ఎదిగాడని... చేపట్టిన పదవికి కీర్తి తెచ్చాడని ప్రశంసల వర్షం కురిపించారు. వెంకయ్యనాయుడు సర్వశక్తిమంతుడు అని ఆయనకు భగవంతుడు ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షును ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. 
 
వెంకయ్య 1948, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. భారతీయ జనతా పార్టీకు చెందిన అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. దేశ ప్రథమ పౌరుడి పదవి తరువాత రెండవ అతిపెద్ద పదవి అయిన ఉపరాష్ట్రపతి పదవిలో వెంకయ్య నాయుడు ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: