హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. హైదరాబాద్ లో లాక్ డౌన్ ని ప్రకటించే అవకాశం ఉన్న నేపధ్యంలో ఇప్పుడు హైదరాబాద్ నుంచి భారీగా సొంత ఊర్లకు తరలి వస్తున్నారు ప్రజలు. ఎవరూ కూడా హైదరాబాద్ లో ఉండటానికి ఇష్టపడటం లేదు. పంతంగి. కొర్లపాడు టోల్ గేటు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

 

రెండు రాష్ట్రాల సరిహద్దు గరికపాడు వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎపీలోకి పోలీసులు జాగ్రత్తలు తీసుకునే అనుమతిస్తున్నారు. కాగా హైదరాబాద్ లో జూన్ 3 నుంచి లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. రేపు జరిగే కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: