గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంకాలజీ విభాగాన్ని సిఎం జగన్ ప్రారంభించారు. క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలను ఏపీ సర్కార్... గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేస్తుంది. రూ 50 కోట్ల వ్యయతో దీనిని సిద్దం చేయగా సిఎం జగన్ ప్రారంభించారు. పేద మధ్య తరగతికి అత్యుత్తమ చికిత్స  అందుతుంది. 


ఈ నేపధ్యంలో మాట్లాడిన సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు తాను చాలా సంతోషంగా ఉన్నా అని సిఎం అన్నారు. అంబులెన్స్ లను కూడా ప్రారంభించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని ఆయన పేర్కొన్నారు. జాతీయ  డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఏపీ తో పాటు తెలుగు డాక్టర్లు అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు ఆయన. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్ళ నానీ పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: