ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 108 సిబ్బంది జీతాలను ఆయన భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 108 డ్రైవర్లకు పది వేలు టెక్నీషియన్ లకు పది వేలు పెంచారు. దీనితో డ్రైవర్లకు 18 వేల నుంచి 28 వేలకు జీతం పెరిగింది. అదే విధంగా టెక్నీషియన్ కి 20 వేల నుంచి 30 వేలకు జీతం పెరిగింది. 

 

గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆంకాలజీ విభాగం ప్రారంభిస్తున్న సందర్భంగా సిఎం జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రతీ ఒక్కరికి కూడా వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నా అని 108  వాహనాలకు డ్రైవర్ల ఇబ్బంది అనేది ఉండకూడదు అని సిఎం జగన్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: