ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత టీడీపీ నేతల భద్రతపై ఇప్పుడు ఆ పార్టీ నేతలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలకు రక్షణ లేదు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు సహా పలువురు నేతలకు భద్రత తగ్గించిన నేపధ్యంలో టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా మరో నేత వర్ల రామయ్య భద్రత విషయంలో టీడీపీ నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. 

 

తాజాగా డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ప్రతిపక్ష నేత, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాసారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కు 1+1 సెక్యూరిటీ కల్పించాలని లేఖలో డీజీపీ ని చంద్రబాబు నాయుడు కోరారు. వర్ల రామయ్య ఇటీవల ప్రభుత్వంపై దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: