ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఇండియా ఇలా ఏ దేశంలో చూసినా కరోనా విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇక ఇప్పటికే క్రీడలకు పాకిన కరోనా దెబ్బతో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు కూడా రద్దవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ రద్దయ్యింది. టీ -20 ప్రపంచ కప్ కూడా రద్దవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక పలు దేశాల మధ్య సీరిస్లు కూడా రద్దవుతున్నాయి.
ఈ క్రమంలోనే కరోనా కారణంతో ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా వాయిదా పడింది. మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతుండటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాతో జింబాబ్వే మూడు మ్యాచ్ల సిరీస్ ఆడాల్సి ఉంది. కరోనా తగ్గాక మరోసారి రెండు దేశాల బోర్డులు సమావేశమై తేదీలను ప్రకటిస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా ఇన్ఛార్జి సీఈవో నిక్ హాక్లీ తెలిపారు.