అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. మున్సిపల్ కార్మికులు గా పనిచేస్తున్న శివ ఇటీవలే గౌతమి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా పెళ్ళయిన కొన్ని రోజులకే నిన్న రాత్రి పుట్టింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది గౌతమి.
ఇక భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పోయింది శివ ధర్మవరం ఎర్రగుంట కు సమీపంలో పుట్టపర్తి రైల్వే ట్రాక్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.