వైసీపీ నేత పివిపి కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేత పివిపి. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించగా కొన్ని షరతులతో కూడిన ముందస్తు బెయిల్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకో కూడదు అంటు పోలీసులకు సూచించింది కాగా తదుపరి విచారణను ఈ నెల 27న వాయిదా వేసింది. కాగా తనపై బెదిరింపులకు పాల్పడ్డాడు అంటూ కైలాష్ అనే వ్యక్తి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పివీపీ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.