వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ ఆయన పదవికి రాజీనామా చేశారు. శాసన మండలి కార్యదర్శి ఆయన రాజీనామా లేఖను అందజేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్. గత నెల 19వ తేదీన సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో కొనసాగుతున్న పిల్లి సుభాష్ కాసేపట్లో మంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా కు సంబంధించిన లేఖ సమర్పించనున్నారు . మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా రాజ్యసభకు ఎన్నికైన నేపద్యంలో ఎమ్మెల్సీ పదవికి మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు.