ఈ మద్య కొంతమంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకోలేక తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు.  కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచిపోతున్నారు.  గత మూడు నెలల నుంచి కరోనా మహమ్మారి వల్ల చాలా మంది మానిసక ఇబ్బందులు పడుతున్నారు. చేయడానికి పనులు లేక.. బయటికి వెళ్తే కరోనా వస్తుందన్న భయంతో ఇక జీవించడం కష్టం అన్న బాధతో ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా ధర్మవరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

గత కొంత కాలంగా శివ,గౌతమిలు ప్రేమించుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. భార్యాభర్తలు కొద్దిరోజులుగా సంతోషంగానే ఉన్నారు.. ఉన్నట్టుండి  గౌతమి నిన్న అర్ధరాత్రి సమయంలో తన పుట్టింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలుసుకున్న శివ భార్య మరణాన్ని జీర్ణించుకోలేక పోయాడు..అంతే ర్మవరం ఎర్రగుంటకు సమీపంలో పుట్టపర్తి వెళ్లే రైల్వే ట్రాక్‌ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే వీరి ఆత్మహత్యకు కారణమని బంధువులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: