తమిళనాడు కడలూరు జిల్లా ఎన్ ఎల్సీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ థర్మల్ ప్లాంట్ లో భారీ పేలుడు సంభవించింది, ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
కార్మికులు పనిలో నిమగ్నమైన సందర్భంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు అధికారులు తెలిపారు, కేంద్ర హోంశాఖ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది.