జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి కరోనా  పరీక్షలకు ఎట్టకేలకు ప్రభుత్వం అనుమతించింది, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక వినతి నేపథ్యంలో ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రులలో కరోనా  వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుమతి మంజూరు చేశారు. 

 

 ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా  వైరస్  పరీక్షలు నిర్వహించుకునేందుకు తగిన  ఏర్పాటు చేస్తున్నామని కొద్దిరోజుల్లోనే ప్రధాన ఆస్పత్రిలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఆర్వీ  కర్ణన్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: