ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మంత్రి మోపిదేవి వెంకట రమణ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించి పెద్దల సభకు ఎన్నికైనందున వీరిద్దరు మండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఈ మేర‌కు వీరిద్ద‌రు త‌మ రాజీనామాల‌ను బుధ‌వారం మండ‌లి చైర్మ‌న్‌కు పంప‌గా ఆయ‌న ఆమోదించారు. ఇక వీరిద్ద‌రితో పాటు రాజ్యసభ ఎన్నికల్లో ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్‌ నత్వాని ఎన్నికైన విషయం తెలిసిందే.

 

ఇక వైసీపీ నుంచి ఇటీవ‌ల మాజీ మంత్రి డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద్ ఎమ్మెల్సీగా ఏక‌గ్రీవంగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్సీలు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డంతో వైసీపీలో అప్పుడే ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అయ్యింది. ఈ రెండు ప‌ద‌వుల కోసం ఏకంగా 20 మంది ఆశావాహులు క్యూలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: