ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టిన రోజు నేపధ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనతో కలిసి ఉన్న ఒక ఫోటో ని షేర్ చేస్తూ విష్ చేసారు. 

 

మిత్రులు, సదా తెలుగుప్రజల శ్రేయోభిలాషులు, తెలుగు భాషాభిమానులు అయిన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు  గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణా సిఎం కేసీఆర్ ఫోన్ చేసి వెంకయ్యకు విష్ చేసారు. అలాగే మరి కొందరు నేతలు కూడా వెంకయ్య కు లేఖలు రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: