ఏపీలో స‌ముద్రంలో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాలు, అక్ర‌మ చేప‌ల చెరువుల‌పై గ్రీన్ ట్రిబ్యున‌ల్ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. అక్ర‌మాల‌పై విచార‌ణ జ‌రిపేందుకు ప్ర‌త్యేకంగా నిపుణ‌ల క‌మిటీ వేసింది.  ఇసుక తవ్వకాలు, రొయ్యల చెరువులపై విచారణ అక్టోబర్ 8కి వాయిదా పడింది. రాజోలు, అంతర్వేది, పలు ప్రాంతాల్లో ఇసుక తవ్వుతున్నారని ఎన్జీటీలో పిటిషన్ వేశారు. సముద్రానికి సమీపంలో అక్రమ రొయ్యల చెరువులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరగట్లేదని ఏపీ ప్రభుత్వం వాదించింది.  

 

కేంద్ర పర్యావరణశాఖ, కేంద్ర గనులశాఖ, ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు పంపింది. పర్యావరణ నష్టాన్ని అంచనా వేసేందుకు సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ, జిల్లా కలెక్టర్ ఉన్నారు. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది. కాగా, అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. అనంతరం కేసు విచారణను ఎన్జీటీ అక్టోబర్ 8కి వాయిదా వేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: